Telangana cm kcr said that we will increase financial assistance from shadi mubarak and kalyana laxmi schemes. KCR address in Telangana assembly on Wednesday.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తమ ప్రభుత్వం అధికారికంగా జరపబోదని కెసిఆర్ స్పష్టం చేశారు.జూన్ 2 తెలంగాణకు అసలైన విమోచన దినోత్సవమని కెసిఆర్ చెప్పారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాల ద్వారా ఇచ్చే సహయాన్ని పెంచనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై తెలంగాణ సీఎం కెసిఆర్ బుధవారం నాడు చెప్పారు. విపక్షాలపై తెలంగాణ సీఎం కెసిఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తీరును అసెంబ్లీలో దుమ్మెత్తిపోశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులతో పాటు ఇప్పటివరకు చోటు చేసుకొన్న పరిస్థితులను కెసిఆర్ ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజునే తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకొందామన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేసిన విషయం వాస్తవమేనని కెసిఆర్ చెప్పారు . కొందరి మనోభావాలను దెబ్బతిసేవిధంగా వ్యవహరించకూడదని తాము భావిస్తున్నామని కెసిఆర్ చెప్పారు. బిజెపి నేతలు మాత్రం కొందరి మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సాయుధపోరాటం కూడ తెలంగాణ విమోచనంలో కూడ భాగమేనని ఆయన చెప్పారు. తెలంగాణ విమోచనపై ప్రేమ ఉన్న బిజెపి నేతలు సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులకు పెన్షన్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
మందకృష్ణ మాదిగతో ఎబిసిడి వర్గీకరణ సాధ్యం కాదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై మందకృష్ణ నిరసనలకు దిగాడని కెసిఆర్ విమర్శించాడు.. టిఆర్ఎస్ కూడ వర్గీకరణకు అనుకూలమనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ అసెంబ్లీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మాణం చేసిందన్నారు. ప్రధానమంత్రికి ఈ తీర్మానం ఇచ్చి వర్గీకరణ గురించి వివరించామన్నారు. అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్ళేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. అయితే ప్రపంచ తెలుగు మహసభలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మకైన మందకృష్ణ మాదిగ ఆందోళనకు దిగితే అరెస్ట్ చేశామన్నారు. ఇదే తరహలో భవిష్యత్తులో కూడ వ్యవహరిస్తే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని కెసిఆర్ ప్రకటించారు.