Surprise Me!

మా జోలికొస్తే.. ఖబడ్దార్!: మోడీకి బాబు తీవ్ర హెచ్చరిక

2018-05-30 1 Dailymotion

మహానాడు ముగింపు సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై, వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జగన్, పవన్, బీజేపీ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, బీజేపీ కుట్రలో జగన్, పవన్ పావులుగా మారారని ఆరోపించారు. తాను ఎప్పుడూ సంయమనం కోల్పోలేదన్నారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు, ఆటలు ఇక్కడ సాగవని ఎన్డీయే నాయకులను హెచ్చరిస్తున్నానని చెప్పారు.