రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు సీఎం రేవంత్రెడ్డి పోలీసులకు కఠిన ఆదేశాలు జారీచేశారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.