Harish Rao Meets Motilal Naik At Gandhi Hospital : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను పరామర్శించారు. వారం రోజులుగా మోతీలాల్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే చిటికేస్తే ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాటతప్పారని ప్రశ్నించారు.