Aswaraopet SI Suicide Incident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. తన భర్త మృతికి సీఐ జితేందర్రెడ్డి, మరో నలుగురు కానిస్టేబుళ్లు కారణమని ఎస్సై భార్య కృష్ణవేణి హైదరాబాద్ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీను మరణవార్త విని మేనత్త గుండెపోటుతో కన్నుమూశారు. ఘటనపై ప్రాథమిక విచారణ నివేదిక తెప్పించుకున్న ఉన్నతాధికారులు సీఐ జితేందర్రెడ్డిని ఐజీ కార్యాలయానికి, మిగతా నలుగురు కానిస్టేబుళ్లను భద్రాద్రి జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు.