TG Govt Focus On Irrigation Projects : ప్రాధాన్యకర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి ఈ ఏడాది ఆరు లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు అదనంగా సాగునీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 75 శాతానికి పైగా పనులు పూర్తైన, తక్కువ వ్యయం అవసరమయ్యే 19 ప్రాజెక్టులను ప్రాధాన్యకరంగా నీటిపారుదల శాఖ గుర్తించింది. వాటికి 19 వేలకోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.