Nara Lokesh Fire on Idupulapaya IIIT Ganja Issue: కడప ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పట్టుబడిన గంజాయిపై సమగ్ర విచారణ జరపాలని ఆధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు లోకేశ్ను కలిశారు. విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. గంజాయిని ప్రోత్సహించే రాజకీయ నాయకులపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.