Gulbenkian Prize Winner Nagendramma Nettem: ప్రకృతి సేద్యం చేస్తూ వందల మందిని సాగు బాట పట్టించిన శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మకు పోర్చుగల్ దేశ గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు వరించింది. పోర్చుగల్ వెళ్లి పురస్కారం అందుకున్న నాగేంద్రమ్మకు స్థానికులు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా నాగేంద్రమ్మ తెలిపారు.