Red Clay Hills Destruction in Andhra Pradesh: కాకినాడ జిల్లాలో ఎర్రమట్టి కొండల్ని వైఎస్సార్సీపీ నేతలు పీల్చిపిప్పిచేశారు. వారి దోపిడీకి పెద్దపెద్ద కొండలు కరిగిపోయి కుంటలయ్యాయి. విద్యుత్ స్తంభాలు ఉన్న చోట్లా వదలకుండా అక్రమంగా మట్టిని తరలించారు. ఇప్పుడవి ప్రమాదకరంగా గాల్లో తేలుతున్నాయి. గతంలో దోపిడీని చూసీ చూడనట్లు వదిలేసిన అధికారులు, కూటమి సర్కారు వచ్చాక చర్యలకు ఉపక్రమించారు.