గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాడు-నేడు పనులపై విచారణ జరుపుతామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన నాసిరకం పనులపై విచారణ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వాటిని మారుస్తామని లోకేశ్ వివరించారు.