Kishan Reddy Fires On Congress : బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీపడి మరీ ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లీస్తోందని, ఓట్ల కోసం తప్ప ప్రజలకు నిధులు ఖర్చు చేయట్లేదని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు.