Two Old Couple Died in One Day at Anantapur District : పెళ్లిలో ఏడడుగులు వేసినప్పటినుంచి ఒకరికొకరు తొడుగా ఉంటూ బతుకు బండిని లాగుతున్నారు ఆ వృద్ధ దంపతులు. రక్తసంబంధికులు ఉన్న ఒకరిపై ఆధారపడకుండా సొంత కష్టంతోనే జీవనం సాగిస్తున్నారు. అలా సాగిపోతున్న వారి దాంపత్య జీవితంలోకి మృత్యువు తొంగిచూసింది. ప్రమాదవశాత్తు భార్యను పోగొట్టుకున్న భర్త.. ఒంటరిగా బతకలేక మృత్యువులోనూ భార్యకు తోడుగా వెళ్లిన విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.