Jadcherla Bus Theft Case Update : సోదరికి డబ్బులు ఇవ్వడానికి సంచిలో రూ. 36లక్షలు పెట్టుకుని బయలు దేరాడు ఆ ప్రయాణికుడు. హైదరాబాద్లో బస్కెక్కాడు. మార్గం మధ్యలో అల్పాహారం కోసం బస్సు ఆగగా సంచిలో డబ్బులున్నాయో లేదోనని ఒకసారి చెక్ చేసుకున్నాడు. తీరా చూస్తే అందులో డబ్బుల్లేవు. దానికి బదులు వాటర్ బాటిళ్లున్నాయి. వెంటనే సమీప పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు కేవలం రెండువారాల వ్యవధిలో మెగా చోరిని ఛేదించారు.