Minister Ponguleti Fires On BRS : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్లో సీతారామ అనుసంధాన కాల్వ పనులను ఆయన పరిశీలించారు. కాల్వ కట్టవద్దకు ట్రాక్టర్పై వెళ్లి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం జల వనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.