Continue Industrial Accidents in joint Visakhapatnam : ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా రియాక్టర్ల పేలుళ్లతో ప్రాణ నష్టం స్థానిక ప్రజలను, కార్మికులను కలవరపెడుతోంది. తాజాగా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని భారీ ప్రమాదం, 2009లో సెజ్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అతి పెద్దదిగా చెబుతున్నారు.