Telangana Rains 2024 : జోరువానలకు ఉమ్మడి మెదక్, మహబూబ్నగర్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చెరువులు, వాగులు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వరద తాకిడికి పంట పొలాలు నీటమునిగాయి. నాగర్కర్నూల్ జిల్లా దుందుభి నదిలో కొట్టుకుపోయిన గొర్రెల కాపరులను నాటు పడవలతో రక్షించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.