Sand Dunes in Crop Felds at Jaggaiahpet : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇటీవల మున్నేరు సృష్టించిన వరద బీభత్సానికి పంటపొలాలు తుడుచుపెట్టుకుపోయాయి. భూములన్నీ ఇసుక మేటలు వేశాయి. పంట నష్టపోయిన బాధలో ఉన్న రైతులకు పొలాల్లోని ఇసుక మేటలు గుదిబండలుగా మారాయి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ గండం గట్టెక్కలేమని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.