Lavanya From Anantapur Secured 65th Rank in NEET PG : తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఎదగాలని లక్ష్యం పెట్టుకుందా యువతి. కన్నవారు చేసే పాడి పనుల్లో సాయం చేస్తూనే చదువుల్లో రాణిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివి ఉత్తమ మార్కులు సాధించింది. తన ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చింది ఆర్డీటీ సంస్థ. ఆ అవకాశాన్ని అందుకుని ఏకంగా నీట్ పీజీ పరీక్షల్లో 65వ ర్యాంకు సాధించింది శ్రీ సత్యసాయి జిల్లాకి చెందిన లావణ్య .