Road Accident in Adilabad : ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.