Surprise Me!

వేడి అన్నం పెట్టమన్నందుకు ఆ కుమారులు తండ్రిని ఏం చేశారో చూడండి?

2024-10-25 0 Dailymotion

Sons Attacked Father in Gadwal : పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వారే తమ సర్వస్వమని, కడవరకు చూస్తారని నమ్ముతారు. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి బాగోగులను చూసుకుంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినాసరే తమ ప్రాణం పోయేంతలా కన్నవారు విలవిలలాడుతారు. తీరా వారు పెరిగి పెద్దవారైన తర్వాత అమ్మానాన్నలే అవసరం లేదని చెప్పేసిన కుమారులు, కుమార్తెలు కూడా ఈ లోకంలో ఉన్నారు.

కన్నవాళ్ల దగ్గర నుంచి ఆస్తులు కావాలి కానీ కన్నవారు మాత్రం అవసరం లేదు. వారిని కన్న పాపానికి చివరకు వారికి వృద్ధాప్యంలో కనీసం తిండి కూడా పెట్టడం లేదు. పిల్లలు తమను కొడుతున్నా బిక్కుబిక్కుమంటూ కాటికి కాలు చాపి కన్నుమూసే క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం కాస్త ధైర్యం చేసి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.