Parvatipuram Manyam Elephants Attack on Labour Auto : ఇటీవల వన్యప్రాణులు జనజీవనంలోకి వస్తున్న సంఘటను సర్వసాధారణమయ్యాయి. పులులు, జింకలుస, ఏనుగు, ఎలుగు, మొసలి ఇలా ఏదో ఒకటి జనావాసాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలుగు దాడులతో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అన్నదాతలను హడలెత్తిస్తున్నాయి. ఇటీవల మామిడి తోటలో ఏనుగుల గుంపు సంచరించింది అంతే కాకుండా రైతుపై దాడి చెయ్యడంతో అతడి మృతి చెందాడు. తాజాగా కూలీలతో వెళ్తున్న ఆటోపై ఏనుగులు దాడి చేసిన ఘటన మన్యం జిల్లాలో జరిగింది.