Surprise Me!

తప్పు చేసిన వారిపై ఆటం బాంబులు పేలతాయ్​: మంత్రి పొంగులేటి

2024-11-08 1 Dailymotion

Ponguleti Hot Comments : మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ పాలకమండలి, వర్ధన్నపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. తప్పు చేయని వారికి ఏమీ కాదని, కానీ ప్రజల డబ్బును విదేశాలకు తరలించి తప్పు చేసినవారికి ఆటమ్‌ బాంబులాగ పేలుతుందని అన్నారు. అరెస్టులపై తానెవరి పేరుని కానీ, పార్టీ పేరును కానీ ప్రస్తావించుకున్నా ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు.