CM Revanth Comments On PM Modi : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం రేవంత్రెడ్డి ఇవాళ ముంబయి చేరుకున్నారు. అక్కడి పీసీసీ ఆఫీస్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.