CM Revanth On Palamuru Irrigation Projects : సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలనీ వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరి మీద ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.