Minister Lokesh Supporting Gulf Victims in AP : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులు దగాపడ్డామనని ఓ పోస్ట్ పెడితే వారిని ఆదుకోవడంలో మంత్రి లోకేశ్ తనదైన ముద్ర చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 నెలల కాలంలోనే ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ-ఎన్నారై విభాగం నేతల సమన్వయంతో సుమారు 20మందిని స్వస్థలాలకు చేర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.