వైఎస్సార్సీపీపై మంత్రి లోకేశ్ నిప్పులు చెరిగారు. శాసనమండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబును అవమానించారని ఈ సందర్భంగా లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లిని దుర్భాషలాడారని మండిపడ్డారు. అయితే తల్లిని అవమానించడాన్ని ఎవరూ సమర్థించరని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.