Ramoji Group Lunches Sabhala Millets : తెలుగువారికి సుపరిచితమైన ప్రియాఫుడ్స్ మరో ముందడుగు వేసింది. పచ్చళ్లు, వంట నూనెలు సహా ఎన్నో నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందిస్తున్న రామోజీ గ్రూప్ సంస్థ ఇప్పుడు చిరుధాన్యాలతో రూపొందించిన 'భారత్ కా సూపర్ఫుడ్'తో ముందుకొచ్చింది. స్వర్గీయ రామోజీరావు దార్శనికతకు అనుగుణంగా 'సబల మిల్లెట్స్ను' ఆవిష్కరించింది. ఎలాంటి ప్రిజర్వేటివ్లు, కృత్రిమ రసాయనాలు లేకుండా ఆనాటి ఆరోగ్యాన్ని నేటిరుచులతో మేళవించి 45రకాల చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది.