Occupied Lands In Mahabaubnagar : కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్టు సొరంగ మార్గాల పైనున్న భూములను సైతం అక్రమార్కులు ఆక్రమించేస్తున్నారు. ప్లాట్లుగా మార్చేసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. విషయం తెలియక భూమి కొన్న అమాయకులు మోసపోతున్నారు. సేకరించిన భూమికి హద్దులు నిర్ణయించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో స్థిరాస్తి వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి విక్రయిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పలు గ్రామాల్లో వెలుస్తున్న అక్రమ వెంచర్లపై కథనం.