Surprise Me!

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన తహశీల్దార్లు

2025-01-01 24 Dailymotion

Two Tahsildars Attacked On Real Estate Agent While Drunk in Chittoor : మద్యం మత్తులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించిన ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. పట్టణంలోని ఓ భోజనశాలపైన ఉన్న బార్‌లో సోమవారం రాత్రి గంగవరం, పెద్దపంజాణి తహసీల్దార్లు హాల్​చల్ చేశారు. స్థిరాస్తి వ్యాపారంలో తలెత్తిన వివాదం కారణంగా కృష్ణకుమార్‌ అనే వ్యక్తిపై ఇద్దరు తహసీల్దార్లు దాడి చేసి గాయపరిచారు. చిత్తూరు పట్టణానికి చెందిన కృష్ణకుమార్‌ కొద్దికాలం క్రితం పలమనేరులో స్థిరాస్తివ్యాపారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలు, భూ పంపకాల్లో కృష్ణకుమార్, తహసీల్దార్ల మధ్య వివాదం తలెత్తింది.