Two Tahsildars Attacked On Real Estate Agent While Drunk in Chittoor : మద్యం మత్తులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించిన ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. పట్టణంలోని ఓ భోజనశాలపైన ఉన్న బార్లో సోమవారం రాత్రి గంగవరం, పెద్దపంజాణి తహసీల్దార్లు హాల్చల్ చేశారు. స్థిరాస్తి వ్యాపారంలో తలెత్తిన వివాదం కారణంగా కృష్ణకుమార్ అనే వ్యక్తిపై ఇద్దరు తహసీల్దార్లు దాడి చేసి గాయపరిచారు. చిత్తూరు పట్టణానికి చెందిన కృష్ణకుమార్ కొద్దికాలం క్రితం పలమనేరులో స్థిరాస్తివ్యాపారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలు, భూ పంపకాల్లో కృష్ణకుమార్, తహసీల్దార్ల మధ్య వివాదం తలెత్తింది.