Awareness to Beggars: కుటుంబ సభ్యులు గెంటేసి ఒకరు, ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక మరొకరు. ఇలా పలువురు విజయవాడ నగరంలో యాచకులుగా మారారు. ఇంకొందరు అన్నీ ఉన్నా యాచించటమే వృత్తిగా మలుచుకుంటున్నారు. యాచించటాన్ని రూపు మాపేందుకు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ ప్రారంభించారు. యాచకులకు పునరావాసం కల్పించి, వారికి చేతి వృత్తుల్లో శిక్షణనిస్తున్నారు. దీంట్లో భాగంగా విజయవాడను యాచకులు లేని నగరంగా చేసేందుకు మున్సిపల్ అధికారులు, ఆపరేషన్ స్మైల్ పీడీ సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.