KADAPA BANGALORE RAILWAY LINE: కడప – బెంగళూరు రైల్వే లైన్ను ప్రారంభించి 15 ఏళ్లైనా నేటికీ పూర్తి కాలేదు. 21 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తి కాగానే ప్రాజెక్టు అటకెక్కింది. వైఎస్ రాజశేఖరరెడ్డి కలని నెరవేర్చాల్సిన జగన్ సైతం గత ఐదేళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉండటంతో ఫిబ్రవరి 1న పార్లమెంటు బడ్జెట్లో దీనికి నిధుల కేటాయిస్తారని జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.