ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సినీనటుడు సోనూసూద్ అన్నారు. సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్సులను ప్రభుత్వానికి అందించారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన సోనూ సూద్ను సీఎం అభినందించారు.