CM CHANDRABABU PRESS MEET IN DELHI: గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి రేట్లు పడిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలని, రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు.