Ex Airforce Employee Land Issue in Proddatur Of YSR District : తమకు కేటాయించిన భూమిలో కొందరు వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని వైమానిక దళ మాజీ ఉద్యోగి కుటుంబం ఆరోపించింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన జింకా చంద్రాయుడు వైమానిక దళంలో సేవ చేసి రిటైరయ్యారు. ఇటీవల ఆయన మృతి చెందారు. దేశానికి ఆయన చేసిన సేవను గుర్తించి 1976లో ప్రభుత్వమే 5.02 ఎకరాల భూమిని డీకేటీ పట్టా ద్వారా కేటాయించింది. అయితే తమ సమీప బంధువులు దౌర్జన్యంగా సాగు చేస్తున్నారని చంద్రాయుడు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.