Peddireddy Ramachandra Reddy Acquired Land Of Tukivakam Pedda Cheruvu : అటవీ భూముల్లో ఫాం హౌస్లు! అసైన్డ్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు! ప్రభుత్వం భూములు కనిపిస్తే కబ్జాలు, అనుమానం వస్తే ఫైళ్లతో సహా కార్యాలయాలు తగలబెట్టడాలు ఇలా చేతికి మట్టి అంటకుండా తెరపై కనిపించకుండా భూకబ్జాలు చేయడంలో రాష్ట్రంలో ఓ పెద్దరెడ్డికి పేటెంట్ ఉంది. విలువైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని సొంతం చేసుకోవడంలో ఓ సరికొత్త నేరవిధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పెద్ద చెరువుకు సంబంధించిన 7.28 ఎకరాల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. రూ.70 కోట్లకు పైగా విలువైన ఈ భూమిని అక్రమంగా చేజిక్కించుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగు చూసింది.