Pawan Kalyan Comments in Janasena Formation Day Meeting : ఓడినా అడుగు ముందుకే వేశామని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాటు చేసిన ‘'జయ కేతనం'’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదని చెప్పారు. అన్నీ ఒక్కడినై పోరాటం చేశానని, మనం నిలబడి పార్టీని నిలబెట్టామని అన్నారు.