Lokesh on Investments in Visakha : విశాఖ బ్రాండ్ను నిలబెట్టుకునేందుకు సర్కార్ ఎంతో కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో గతంలో పెట్టుబడులు పెట్టమని తిరిగి వెళ్లిపోయిన వారు కూడా ఇప్పుడు ముందుకొస్తున్నారని చెప్పారు. టీసీఎస్ కొద్ది రోజుల్లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. విశాఖ బీచ్ రోడ్డులో ఓ స్టార్ హోటల్కు భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.