Protest At Delhi Jantar Mantar For Demanding Increase In BC Reservation : బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో దిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.