Major parties Camp politics: విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. ఇప్పటికే వైసీపీ పక్షం కర్ణాటక, కేరళతో పాటు శ్రీలంకలోనూ శిబిరాలు ఏర్పాటు చేసింది. టీడీపీ పక్షం కౌలాలంపూర్లో శిబిరం నిర్వహిస్తోంది. జనసేన పక్షం మాత్రం క్యాంపు రాజకీయాలకు దూరం పాటిస్తోంది.