Deputy CM Pawan Kalyan Wife Anna Lezhneva in Tirumala : శ్రీవారి దర్శనార్థం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం వద్దకు చేరుకున్న అన్నాలెజినోవా శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా ఆలయ సాంప్రదాయంను పాటిస్తూ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి తిరుమలలోనే ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని అన్నాలెజినోవా దర్శించుకొని మొక్కులు చెల్లించనున్నారు.