Bhu Bharathi Awareness Programme in Nagarkurnool District : భూభారతి చట్టం అవగాహన సదస్సు కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ ప్రాంగణంలో ల్యాండ్ అవుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్కు ప్రమాదం తప్పింది. హెలిప్యాడ్ సమీపంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన పోలీసులు మంటలను అదుపు చేశారు. శనివారం(ఏప్రిల్ 19) భూ భారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ హెలికాప్టర్లో వచ్చారు.