Surprise Me!

ఒక్క రూపాయికి ఇడ్లీ రాదు.. ఎకరా భూమి ఎలా కేటాయిస్తారు?: YS జగన్ | YSRCP | Asianet News Telugu

2025-04-25 3,694 Dailymotion

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల‌కు అండ‌గా ఉంటాన‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. తెగువ అంటే ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ అంటూ ఇటీవ‌ల ఉప ఎన్నిక‌లో ధైర్య‌స‌హ‌సాలు చూపిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అభినందించారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ స్థానిక సంస్థల్లో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. సమావేశంలో ఆయా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు, ఎంపీపీలు, ఎంపీటీసీలు.. ఇంకా ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకుల‌తో క‌లిసి ముందుగా, కశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైయస్‌ జగన్‌ నివాళులర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంత‌రం పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.


#ysjagan #ysrcp #pahalgamattack #tdp #chandrababu #URSA #appolitics #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️