Surprise Me!

2027 కల్లా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలి - అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం

2025-05-15 6 Dailymotion

CM Revanth Review Irrigation Dept : కృష్ణానదిపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, ఉదండాపూర్​ వరకు తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. కృష్ణాజలాల్లో న్యాయబద్ధమైన వాటా కోసం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం సహా రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని జలసౌధలో నీటిపారుదల శాఖకి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కలిసి నదీజలాలు, అంతర్ రాష్ట్ర అంశాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.