Case Registered Against Former Minister Peddi Reddy : అటవీ భూములు ఆక్రమించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించడంపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరపై కేసులు నమోదయ్యాయి. అటవీ భూములను ఆక్రమించడంతో పాటు జీవ వైవిద్యానికి హాని కలిగించారని కేసు పెట్టారు.