44th Mahanadu Arrangements in Kadapa : కడపలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడును కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. మహానాడు నిర్వహణ కోసం 13 కమిటీలను ఏర్పాటు చేశారు. 5 లక్షల మందితో మహానాడు నిర్వహించేలా జన సమీకరణ చేయాలని కమిటీ తీర్మానించింది. సీఎం చంద్రబాబుయ మహానాడు వేదిక నుంచి రాయలసీమకు గొప్ప ప్రాజెక్టు మంజూరు చేస్తూ ప్రకటన చేస్తారని మంత్రులు స్పష్టం చేశారు.