తెలుగు ప్రజలు తనపై చూపిన అభిమానంతోనే నాడు సైబరాబాద్ నిర్మాణం, నేడు అమరావతి నిర్మాణం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు-వన్ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.