Hydra commissioner Ranganath On Fire Accidents : హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం ఒక గుణపాఠం లాంటిదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడం బాధాకరమన్న ఆయన పురాతన భవనాల్లో అగ్నిప్రమాద భద్రతా నిబంధనలు పాటించకపోవడం, వాటిని నిరంతరం తనిఖీ చేయకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. అలాంటి భవనాల్లో నిర్మాణాన్ని ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం సాధ్యం కాదన్న రంగనాథ్ యజమానులు తప్పకుండా తగిన అవగాహనతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం త్వరలోనే అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందంటోని వివరించారు.