Untimely Rains in Telangana : కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కొనుగోళ్లలో జాప్యం, లారీల కొరతతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే రైతులు కన్నీరు మున్నీరుమున్నీరవుతున్నారు. టార్పాలిన్లు సరిపడా లేక, పలు చోట్ల పరదాలు కప్పినప్పటికీ ధాన్యపు రాశుల కిందకు నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కక్కరు చనిపోయారు.